తిరుపతి నుంచి అమరావతికి పాదయాత్ర
తిరుమల తిరుపతి దేవస్థానంలో టీటీడీ వేతనాలు పొందుతూ ఇతర మతాలను ఆరాధిస్తున్న వారిని తొలగించాలని, వారిపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్రెడ్డికి పిర్యాదు చేస్తామని శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందస్వామి సృష్టం చేశారు. శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 22 వేల మందికి ప్రత్యక్షంగా, 2 లక్షల మందికి పరోక్షంగా ఉపాది కల్పిస్తున్న టీటీడీలో అన్యమతస్తులు ఉండడం విచారకరం అన్నారు. వీరిని వెంటనే తొలగించాలని సంక్రాంతి తర్వాత హిందూ సంఘాలతో తిరుపతి నుంచి అమరావతికి పాదయాత్ర చేస్తామన్నారు. ఇందులో దేశంలోని అన్ని హిందూ సంఘాల ప్రాతినిథ్యం ఉంటుందన్నారు. టీటీడీలో నిఘా వ్యవస్థ మరింత పటిష్టంగా నిర్వహించాలన్నారు.
Tags :